ఐటీ వాళ్లు మమ్మల్ని ఏం చేయగలరు?- సుజనాచౌదరి

చైనాలో కమ్యూనిస్టుల తరహాలో మోడీ పాలన ఉందని విమర్శించారు మొన్నటి వరకు కేంద్రకేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన టీడీపీ ఎంపీ సుజనాచౌదరి. ఉక్కు పరిశ్రమకు సంబంధించి రాష్ట్రం వివరాలు ఇవ్వడం లేదని చెప్పడం సరికాదన్నారు. తాము ఇప్పటికే అన్ని వివరాలు ఇచ్చామన్నారు. ఉక్కుశాఖ మంత్రి చేతిలో అధికారాలే లేవని తమకు ఇది వరకే అర్థమైందన్నారు. బీజేపీలాంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి వీల్లేందన్నారు సుజనాచౌదరి. ఐటీ దాడులకు తాము భయపడేవారిమి కాదన్నారు. ఐటీ వాళ్లు వచ్చి ఏం చేయగలరని ప్రశ్నించారు. […]

Advertisement
Update: 2018-10-20 03:52 GMT

చైనాలో కమ్యూనిస్టుల తరహాలో మోడీ పాలన ఉందని విమర్శించారు మొన్నటి వరకు కేంద్రకేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన టీడీపీ ఎంపీ సుజనాచౌదరి. ఉక్కు పరిశ్రమకు సంబంధించి రాష్ట్రం వివరాలు ఇవ్వడం లేదని చెప్పడం సరికాదన్నారు. తాము ఇప్పటికే అన్ని వివరాలు ఇచ్చామన్నారు.

ఉక్కుశాఖ మంత్రి చేతిలో అధికారాలే లేవని తమకు ఇది వరకే అర్థమైందన్నారు. బీజేపీలాంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి వీల్లేందన్నారు సుజనాచౌదరి. ఐటీ దాడులకు తాము భయపడేవారిమి కాదన్నారు.

ఐటీ వాళ్లు వచ్చి ఏం చేయగలరని ప్రశ్నించారు. ఐటీ వాళ్లు వస్తుంటారు పోతుంటారని వ్యాఖ్యానించారు. కాకపోతే ఈ సమయంలో ఎందుకు దాడులు జరుగుతున్నాయన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Tags:    
Advertisement

Similar News