ఆర్కేను మంగళగిరిలోనే మర్డర్‌ చేస్తాం...

గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బెదిరింపు లేఖ వచ్చింది.రామకృష్ణారెడ్డిని హతమారుస్తామని లేఖలో దుండగులు బెదిరించారు. ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టుకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో తీరు మార్చుకోకుంటే మంగళగిరిలోనే హత్య చేస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేఖలో దుండగులు వార్నింగ్ ఇచ్చారు.  ”నీకు ఇదే ఆఖరి రోజులు… మేమంటే ఏంటో త్వరలోనే నీకు తెలుస్తుంది” అంటూ రాశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ […]

Advertisement
Update: 2016-09-12 02:40 GMT

గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బెదిరింపు లేఖ వచ్చింది.రామకృష్ణారెడ్డిని హతమారుస్తామని లేఖలో దుండగులు బెదిరించారు. ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టుకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో తీరు మార్చుకోకుంటే మంగళగిరిలోనే హత్య చేస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేఖలో దుండగులు వార్నింగ్ ఇచ్చారు. ”నీకు ఇదే ఆఖరి రోజులు… మేమంటే ఏంటో త్వరలోనే నీకు తెలుస్తుంది” అంటూ రాశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలని కొద్దిరోజుల క్రితం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టుకు ఆశ్రయించారు. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు వాయిసేనని ఫోరెన్సిక్ ల్యాబ్‌లు నిర్ధారించిన నివేదికను అందజేశారు. దీంతో ఏసీబీ కోర్టు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని తెలంగాణ ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏసీబీ కోర్టు ఆదేశాలపై చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని రామకృష్ణారెడ్డి… ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సుప్రీంను ఆశ్రయిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపు లేఖ వచ్చింది.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News