నేను సిద్ధపడే వచ్చా- భూమన

తుని ఘటనలో రెండోరోజు సీఐడీ ముందు విచారణకు వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి హాజరయ్యారు. కాపు ఉద్యమంలో తనను బలిపశువు చేయడాన్ని దేవుడిచ్చిన ప్రసాదంగా భావిస్తానన్నారు.   సీఐడీ తనను అరెస్ట్ చేస్తుందో లేదో తనకు తెలియదన్నారు. సీఐడీ ఏం చేసినా దానికి తాను సిద్ధపడే ఉన్నానని భూమన వెల్లడించారు. పరోక్షంగా అరెస్ట్‌కు సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు ఇంటిపేరు వంచనా, కేరాఫ్ అడ్రస్ కుట్ర అని భూమన విమర్శించారు. చంద్రబాబు గోత్రం మోసం అని అన్నారు. […]

Advertisement
Update: 2016-09-07 01:13 GMT

తుని ఘటనలో రెండోరోజు సీఐడీ ముందు విచారణకు వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి హాజరయ్యారు. కాపు ఉద్యమంలో తనను బలిపశువు చేయడాన్ని దేవుడిచ్చిన ప్రసాదంగా భావిస్తానన్నారు. సీఐడీ తనను అరెస్ట్ చేస్తుందో లేదో తనకు తెలియదన్నారు. సీఐడీ ఏం చేసినా దానికి తాను సిద్ధపడే ఉన్నానని భూమన వెల్లడించారు. పరోక్షంగా అరెస్ట్‌కు సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు ఇంటిపేరు వంచనా, కేరాఫ్ అడ్రస్ కుట్ర అని భూమన విమర్శించారు. చంద్రబాబు గోత్రం మోసం అని అన్నారు. పోలీసులను కూడా స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. తనను కేసులో ఇరికించి జైలు పాలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అన్నింటికి తాను సంసిద్దమయ్యానని చెప్పారు. కాపు ఉద్యమానికి వైసీపీ మద్దతు ఇవ్వడమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. మరోవైపు నిన్నటితో పోలిస్తే ఇవాళ గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద పోలీసుల హడావుడి ఎక్కువగా కనిపించింది.. బారికేడ్లను ఏర్పాటు చేశారు. కార్యాలయం వద్ద ఆంక్షలు విధించారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News