దురుద్దేశంతోనే నోటీసులు... సీఐడీ ముందు హాజరైన భూమన

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ ముందు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో భూమనను సీఐడీ విచారిస్తోంది. వైసీపీ నేతలు చెవిరెడ్డి, అంబటిరాంబాబుతో కలిసి ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు. తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని విచారణకు ముందు భూమన మీడియాతో చెప్పారు. దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు జారీ చేసిందన్నారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే తాను విచారణకు హాజరయ్యానన్నారు. ఇటీవల తుని రైలు ఘటన వ్యవహారంలో భూమనతో పాటు మరో 19మందికి సీఐడీ […]

Advertisement
Update: 2016-09-06 01:16 GMT

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ ముందు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో భూమనను సీఐడీ విచారిస్తోంది. వైసీపీ నేతలు చెవిరెడ్డి, అంబటిరాంబాబుతో కలిసి ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు. తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని విచారణకు ముందు భూమన మీడియాతో చెప్పారు. దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు జారీ చేసిందన్నారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే తాను విచారణకు హాజరయ్యానన్నారు. ఇటీవల తుని రైలు ఘటన వ్యవహారంలో భూమనతో పాటు మరో 19మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. మిగిలిన వారు ఈనెల 4న రాజమండ్రిలో సీఐడీ ముందు హాజరయ్యారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News