బాగ్దాద్లో ఐఎస్ మారణకాండ...80మందికి పైగా మృతి!
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉగ్రవాదులు దారుణ మారణహోమానికి తెగబడ్డారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా శనివారం అర్థరాత్రి దాటాక భోజనాలు చేస్తున్న వారిని, షాపింగ్ చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఈ పేలుళ్లలో 80మందికిపైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాదాపు 200మంది గాయపడి ఉంటారని భావిస్తున్నారు. మొదట కరాదా మార్కెట్ ప్రాంతంలో ఒక ట్రక్లో ఉంచిన, పేలుడు పదార్థాలను నింపిన ఫ్రిజ్ని ఆత్మాహుతి దాడి సభ్యుడు పేల్చేశాడు. ఈ దాడిలో పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. […]
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉగ్రవాదులు దారుణ మారణహోమానికి తెగబడ్డారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా శనివారం అర్థరాత్రి దాటాక భోజనాలు చేస్తున్న వారిని, షాపింగ్ చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఈ పేలుళ్లలో 80మందికిపైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాదాపు 200మంది గాయపడి ఉంటారని భావిస్తున్నారు. మొదట కరాదా మార్కెట్ ప్రాంతంలో ఒక ట్రక్లో ఉంచిన, పేలుడు పదార్థాలను నింపిన ఫ్రిజ్ని ఆత్మాహుతి దాడి సభ్యుడు పేల్చేశాడు. ఈ దాడిలో పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. అనంతరం అల్-షాబ్ అనే ప్రాంతంలోజరిగిన బాంబు పేలుడులో కనీసం ఇద్దరు మరణించి ఉంటారని తెలుస్తోంది.
దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుండి ఫలూజా నగరాన్ని ఇరాకీ భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న వారం రోజులకే ఈ దాడులు జరిగాయి. దాడులకు సంబంధించి టివిల్లో ప్రసారమైన దృశ్యాల్లో నాలుగు పెద్ద భవంతులు ధ్వంసమైనట్టుగా కనబడుతున్నాయి. భవనాల కింద పడి మరింతమంది మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.