ట్యాబ్ కొంటేనే...పుస్తకాలిస్తాం!
స్కూలు ఫీజులు, పుస్తకాల ఖర్చునే భరించ లేకపోతున్న మధ్యతరగతి తల్లిదండ్రుల నెత్తిమీద ట్యాబ్ ఖర్చు వచ్చి పడింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా కార్పొరేట్ స్కూళ్లు పిల్లలకు ట్యాబ్ కూడా తప్పనిసరి అంటున్నాయి. స్కూల్లోనే పుస్తకాలు, డ్రస్లు, బెల్ట్లు తదితరాలు అమ్మే కార్పొరేట్ స్కూళ్లు తమ స్కూల్లోనే ట్యాబ్ కొనాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. ఒక్కో ట్యాబ్ ధర పదివేల రూపాయిలుగా నిర్ణయించాయి. కొన్ని స్కూళ్లలో మూడో తరగతి నుండి ఆరువరకు క్లాసుల్లో వీటిని వాడుతుండగా కొన్ని స్కూళ్లలో […]
స్కూలు ఫీజులు, పుస్తకాల ఖర్చునే భరించ లేకపోతున్న మధ్యతరగతి తల్లిదండ్రుల నెత్తిమీద ట్యాబ్ ఖర్చు వచ్చి పడింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా కార్పొరేట్ స్కూళ్లు పిల్లలకు ట్యాబ్ కూడా తప్పనిసరి అంటున్నాయి. స్కూల్లోనే పుస్తకాలు, డ్రస్లు, బెల్ట్లు తదితరాలు అమ్మే కార్పొరేట్ స్కూళ్లు తమ స్కూల్లోనే ట్యాబ్ కొనాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. ఒక్కో ట్యాబ్ ధర పదివేల రూపాయిలుగా నిర్ణయించాయి. కొన్ని స్కూళ్లలో మూడో తరగతి నుండి ఆరువరకు క్లాసుల్లో వీటిని వాడుతుండగా కొన్ని స్కూళ్లలో పదో తరగతి వరకు వాడుతున్నారు. మార్కెట్లో అయిదువేలకు లోపు ధరలోనే దొరుకుతున్నవాటికి పదివేలు ధరపెట్టి, పుస్తకాలు ట్యాబ్కి కలిపి పదిహేను వేలు వసూలు చేస్తున్నారు.
పుస్తకాలు మాత్రమే కొంటామంటే కుదరదని చెబుతున్నారు. అలాగే ట్యాబ్లను కూడా బయట మార్కెట్లో కొనకూడదంటున్నారు. తమ స్కూలు ట్యాబ్ల్లో ప్రత్యేక యాప్లు ఉంటాయని వారు చెబుతున్నారు. పిల్లలకు హోం వర్కులు, పరీక్షలు కూడా ట్యాబ్ల ద్వారా రాయించే ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలకు టెక్నాలజీని పరిచయం చేయటం మంచి విషయమే కానీ, ప్రతి విద్యార్థీ పదివేలు పెట్టి ట్యాబ్ని కొనాలని, అదీ స్కూల్లోనే అంత ధర పెట్టి కొనాలనే నిబంధన మాత్రం బాగోలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యాధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.