కూతురితో కలిసి ప్రెస్‌మీట్... జగన్‌కు ఇదే తమ సవాల్ అన్న భూమా

తాము డబ్బుకు అమ్ముడుపోయామని వైసీపీ నేతలు విమర్శించడాన్ని  టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి తన కూతురితో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి స్పందించారు. జగన్‌కు సవాల్ విసిరారు. డబ్బులకు అమ్ముడుపోయామని మరోసారి కించపరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదే జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు తాము చేస్తున్న హెచ్చరిక అన్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని భూమా చెప్పారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే […]

Advertisement
Update: 2016-06-15 06:31 GMT

తాము డబ్బుకు అమ్ముడుపోయామని వైసీపీ నేతలు విమర్శించడాన్ని టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి తన కూతురితో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి స్పందించారు. జగన్‌కు సవాల్ విసిరారు. డబ్బులకు అమ్ముడుపోయామని మరోసారి కించపరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదే జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు తాము చేస్తున్న హెచ్చరిక అన్నారు.

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని భూమా చెప్పారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే పార్టీ మూసుకునేందుకు జగన్‌ సిద్ధమా అని సవాల్ చేశారు. తమ సవాల్‌పై జగన్ స్పందించాలన్నారు. తమది డబ్బులకు అమ్ముడుపోయే కుటుంబం కాదన్నారు భూమా. తమకున్న సంపదంతా ప్రజాబలమేనని చెప్పారు. అదే సమయంలో బ్రిటిష్ కాలం నుంచి తమ కుటుంబం ఆర్థికంగా ఉన్నదేనని భూమా వెల్లడించారు.

30 ఏళ్లుగా తమ కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయని… తమ మామ, తన భార్య, ఇప్పుడు కూతురు కూడా రాజకీయాలు చేస్తున్నారని భూమా గుర్తు చేశారు. తెలంగాణలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరితే విమర్శించని జగన్… తమను మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారని భూమా ప్రశ్నించారు. తామేమైనా జగన్‌కు చౌకగా కనిపిస్తున్నామా అని భూమా నాగిరెడ్డి ప్రశ్నించారు. చూడాలి రాజీనామాకు సిద్దమంటున్న భూమా సవాల్‌పై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News