ఈ వారంలో సాక్షి కనిపించకపోతే... వైర్లు తెగి రోడ్ల మీద పడుతాయ్...

ప్రభుత్వం సాక్షిఛానల్‌ ప్రసారాలను నిలిపివేయించడంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. విజయవాడ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన… ఈ వారంలోగా సాక్షి ప్రసారాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఏపీలో ఏ ఛానల్‌ ప్రసారాలు కూడా రానివ్వబోమన్నారు. ఈ వారం చూస్తామని అప్పటికీ సాక్షి ప్రసారాలను పునరుద్దరించకుంటే కేబుల్ వైర్లు తెగి రోడ్డు మీద పడుతాయని హెచ్చరించారు. ఎన్నికేసులుపెట్టినా భయపడే ప్రసక్తే లేదని, రాష్ట్రంలో మరే న్యూస్ ఛానల్ రాకుండా చేస్తామన్నారు. సాక్షి మిగిలిన […]

Advertisement
Update: 2016-06-14 08:43 GMT

ప్రభుత్వం సాక్షిఛానల్‌ ప్రసారాలను నిలిపివేయించడంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. విజయవాడ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన… ఈ వారంలోగా సాక్షి ప్రసారాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఏపీలో ఏ ఛానల్‌ ప్రసారాలు కూడా రానివ్వబోమన్నారు. ఈ వారం చూస్తామని అప్పటికీ సాక్షి ప్రసారాలను పునరుద్దరించకుంటే కేబుల్ వైర్లు తెగి రోడ్డు మీద పడుతాయని హెచ్చరించారు. ఎన్నికేసులుపెట్టినా భయపడే ప్రసక్తే లేదని, రాష్ట్రంలో మరే న్యూస్ ఛానల్ రాకుండా చేస్తామన్నారు.

సాక్షి మిగిలిన ఛానళ్ల వంటిది కాదన్నారు. ప్రతి ఛానల్‌కు యజమాని ఒక్కరే ఉంటారని, సాక్షి మాత్రం వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల సొంత ఛానల్‌ అని అన్నారు. సాక్షి ఛానల్ కోసం ఎంతవరకైనా పోరాడేందుకు సిద్దమన్నారు. ఎంఎస్‌వోలు ఆలోచించుకోవాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ఎన్టీఆర్ పేదల కోసం పార్టీని స్థాపిస్తే చివరకు ఆయనను మెడపట్టి బయటకు గెంటేసిన కుటుంబసభ్యులున్న పార్టీ టీడీపీ అన్నారు. కానీ వైఎస్‌ను ప్రజల గుండెల్లో నిలిపేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబసభ్యులున్న పార్టీ వైసీపీ అని కొడాలి అన్నారు. ఓటుకు నోటుకు భయపడి ఇంకా ఎనిమిదేళ్లు హైదరాబాద్ లో వుండే అవకాశం వున్నా అక్కడ నుంచి పారిపోయి వచ్చిన సన్యాసి చంద్రబాబు అని కొడాలి ఎద్దేవా చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News