టీటీడీపీ నుంచి మరో కీలక నేత జంప్!

తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మల్కాజ్‌గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పార్టీ మారుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీమారే అంశంపై కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. జూన్ 2న ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెబుతున్నారు. తెలంగాణ నుంచి మల్లారెడ్డి ఒక్కరే టీడీపీ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్దికాలంగా మల్లారెడ్డి పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం తర్వాత పార్టీ మార్పు గురించి మల్లారెడ్డి గట్టిగా ఆలోచన చేస్తున్నారు. Click […]

Advertisement
Update: 2016-05-30 04:20 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మల్కాజ్‌గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పార్టీ మారుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీమారే అంశంపై కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. జూన్ 2న ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెబుతున్నారు. తెలంగాణ నుంచి మల్లారెడ్డి ఒక్కరే టీడీపీ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్దికాలంగా మల్లారెడ్డి పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం తర్వాత పార్టీ మార్పు గురించి మల్లారెడ్డి గట్టిగా ఆలోచన చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News