చంద్రబాబును ప్రకృతి అంగీకరించదు: బుడ్డా
కర్నూలులో జరుగుతున్న జగన్ జలదీక్షలో వైసీపీ నేత బుడ్డా శేషా రెడ్డి ప్రసంగించారు. ఇటీవల తన సోదరుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో శేషారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 17 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన చంద్రబాబు సాధించేది ఏమీ ఉండదన్నారు. ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గాలకు ఏమీ చేయలేకపోతున్నామని చెప్పుకున్న చేతగాని అసమర్థులను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. స్వయంగా తాము అసమర్థులం అని ప్రకటించుకున్న […]
కర్నూలులో జరుగుతున్న జగన్ జలదీక్షలో వైసీపీ నేత బుడ్డా శేషా రెడ్డి ప్రసంగించారు. ఇటీవల తన సోదరుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో శేషారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 17 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన చంద్రబాబు సాధించేది ఏమీ ఉండదన్నారు. ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గాలకు ఏమీ చేయలేకపోతున్నామని చెప్పుకున్న చేతగాని అసమర్థులను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. స్వయంగా తాము అసమర్థులం అని ప్రకటించుకున్న 17 మంది ఎమ్మెల్యేల వల్ల చంద్రబాబుకు వచ్చే లాభం ఏమీ ఉండదన్నారు.
చంద్రబాబు తలకాయలో గుజ్జు లేదని ఉన్నది కేవలం బురద మాత్రమేనని అందుకే ఇలా అసమర్థులైన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 420 కాబట్టి సహజంగానే 420 క్యారెక్టర్ ఉన్న నేతలంతా ఆయన వద్దకు వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా కరువు రూపంలో దరిద్రం వస్తుందన్నారు. జనం చంద్రబాబు మాటలకు మోసపోయి ఓటేసినా… బాబు గురించి బాగా తెలిసిన ప్రకృతి మాత్రం సహకరించడం లేదన్నారు. అందుకే చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి వర్షాలు రావడం లేదన్నారు.
బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బుడ్డా శేషారెడ్డిలు అన్నదమ్ములు. రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇటీవల టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో శేషారెడ్డి యాక్టివ్ అయ్యారు. వీరి తండ్రి వెంగళరెడ్డి … ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.
Click on Image to Read: