చేతగాని తనం అనుకోవద్దు!... భూమా వార్నింగ్

వైసీపీ ఎమ్మెల్యే అయిన టీడీపీ నేత భూమా నాగిరెడ్డి … జ‌గ‌న్ జ‌ల‌దీక్ష‌పై గ‌ట్టిగా మాట్లాడారు. జ‌గ‌న్‌కు చిత్త‌శుద్ధి ఉంటే దీక్ష‌లు ఢిల్లీలో చేయాల‌న్నారు. తెలంగాణ‌లో కాంట్రాక్టులు తీసుకున్న వైసీపీ నేత‌లు ఇక్క‌డ మాత్రం దీక్ష‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. క‌ర్నూలు జిల్లా నేత‌ల‌ను కూడా సంప్ర‌దించ‌కుండా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే జ‌గ‌న్ దీక్ష చేశార‌ని భూమా విమ‌ర్శించారు. త‌మ నేత చంద్ర‌బాబు స‌హ‌నాన్ని చేత‌గాని తనంగా భావించ‌వ‌ద్ద‌ని జ‌గ‌న్‌ను హెచ్చ‌రించారు. ప‌క్క రాష్ట్రాల‌తో సామ‌ర‌స్య‌పూర్వ‌కంగానే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు. […]

Advertisement
Update: 2016-05-18 06:28 GMT

వైసీపీ ఎమ్మెల్యే అయిన టీడీపీ నేత భూమా నాగిరెడ్డి … జ‌గ‌న్ జ‌ల‌దీక్ష‌పై గ‌ట్టిగా మాట్లాడారు. జ‌గ‌న్‌కు చిత్త‌శుద్ధి ఉంటే దీక్ష‌లు ఢిల్లీలో చేయాల‌న్నారు. తెలంగాణ‌లో కాంట్రాక్టులు తీసుకున్న వైసీపీ నేత‌లు ఇక్క‌డ మాత్రం దీక్ష‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. క‌ర్నూలు జిల్లా నేత‌ల‌ను కూడా సంప్ర‌దించ‌కుండా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే జ‌గ‌న్ దీక్ష చేశార‌ని భూమా విమ‌ర్శించారు. త‌మ నేత చంద్ర‌బాబు స‌హ‌నాన్ని చేత‌గాని తనంగా భావించ‌వ‌ద్ద‌ని జ‌గ‌న్‌ను హెచ్చ‌రించారు. ప‌క్క రాష్ట్రాల‌తో సామ‌ర‌స్య‌పూర్వ‌కంగానే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో గొడవపెట్టుకోవాలని చెబుతున్న జగన్‌… అలా చేస్తే వచ్చే ప్రయోజనాలేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ఆలోచ‌న ధోర‌ణి మార్చుకుని ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌న్నారు. రాజకీయం వేరు.. వ్యాపారం వేరు అంటే ఎలా అని భూమా ప్రశ్నించారు.

చంద్రబాబు ఓర్పు స‌హ‌నంతో అన్ని స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడుతున్నార‌ని కితాబు ఇచ్చారు. ఏ క్షణాల్లో అయినా ప్రత్యేక హోదా పై కేంద్ర వైఖ‌రిలో మార్పు రావ‌చ్చ‌ని భూమా చెప్పారు. క‌ర్నూలులో జ‌గ‌న్ దీక్ష చేయడంపై కొన్ని అనుమానాలు ఉన్నాయ‌న్నారు. అయితే వైసీపీ నుంచి సంక్ర‌మించిన ఎమ్మెల్యే ప‌ద‌వికి ఎప్పుడు రాజీనామా చేస్తార‌న్న‌ది మాత్రం భూమానాగిరెడ్డి చెప్ప‌లేదు. బ‌హుశా జ‌గ‌న్ క‌ర్నూలులో దీక్ష చేశారు కాబ‌ట్టి అదే జిల్లాకు చెందిన తాను స్పందించ‌క‌పోతే చంద్ర‌బాబు త‌ప్పుగా భావిస్తార‌న్న ఉద్దేశంతో భూమా కౌంట‌ర్ ఇచ్చారు కాబోలు.

Click on Image to Read:

Advertisement

Similar News