మోదీ రాజ్యంలోనూ ఇంతేనా ?... డ్రైనేజ్‌లో పడ్డ మహిళా ఎంపీ

గుజరాత్‌లో మహిళా ఎంపీ ఒకరు డ్రైనేజ్‌లో పడిపోయారు. అభివృద్ధిలో సూపర్ అని చెప్పుకునే జామ్‌నగర్‌లోనే ఈ ఘటన జరిగింది. నాసిరకంగా నిర్మించిన డ్రైనేజ్ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఎంపీ పూనమ్ 10 అడుగుల లోతులోకి పడిపోయారు. పూనమ్ జామ్‌నగర్‌ నుంచి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన పూనమ్ అక్కడి అధికారులతో మాట్లాడుతూ రోడ్డుపై నిల్చున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలిపోయింది. అంతే పూనమ్ డ్రైనేజ్‌ బురదలోకి పడిపోయారు. ఎంపీతో పాటు అక్కడే […]

Advertisement
Update: 2016-05-16 03:48 GMT

గుజరాత్‌లో మహిళా ఎంపీ ఒకరు డ్రైనేజ్‌లో పడిపోయారు. అభివృద్ధిలో సూపర్ అని చెప్పుకునే జామ్‌నగర్‌లోనే ఈ ఘటన జరిగింది. నాసిరకంగా నిర్మించిన డ్రైనేజ్ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఎంపీ పూనమ్ 10 అడుగుల లోతులోకి పడిపోయారు. పూనమ్ జామ్‌నగర్‌ నుంచి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన పూనమ్ అక్కడి అధికారులతో మాట్లాడుతూ రోడ్డుపై నిల్చున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలిపోయింది. అంతే పూనమ్ డ్రైనేజ్‌ బురదలోకి పడిపోయారు. ఎంపీతో పాటు అక్కడే ఉన్న కొందరు యువకులు కూడా డ్రైనేజ్‌లోకి పడిపోయారు. అయితే ఆ సమయంలో డ్రైనేజ్‌లో ప్రవాహం తక్కువగా ఉండడంతో ఎంపీ ప్రాణాలతో బయటపడ్డారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది. వెంటనే తేరుకున్న స్థానికులు ఎంపీని బయటకు లాగారు.

జామ్‌ నగర్‌లోని డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం ఎంత నాసిరకంగా ఉందో ఈ ఘటనే నిదర్శనమని విపక్షాలు ఆరోపించారు. కాంట్రాక్టర్లు అధికార పార్టీ కుమ్మక్కు అవడం వల్లే ఇలా దారుణంగా నిర్మాణాలు ఉంటున్నాయని మండిపడుతున్నారు. మొత్తం మీద అవినీతి లేని, అభివృద్ధిలో అగ్రగామి అని చెప్పుకునే ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో ఈ ఘటన జరగడం అందరి దృష్టికి ఆకర్శించింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News