రంగంలోకి రాజకీయ బినామీలు

రాయ‌ల‌సీమ‌లో ఇటీవ‌ల టీడీపీకి బీజేపీ నేత‌లు చికాకు క‌లిగిస్తున్నారు. రాయ‌ల‌సీమ నీటి కోసం అంటూ, క‌రువు అధ్య‌య‌నం అంటూ టీడీపీని ఇరుకున పెడుతున్నారు. దీంతో బీజేపీ నేత‌ల ఎత్తుకు విరుగుడు చంద్ర‌బాబు కొత్త ఎత్తువేశార‌ని చెబుతున్నారు. సీమ‌లో త‌మ‌ను ఇబ్బంది పెడుతున్న క‌మ‌ల‌నాథుల‌కు ప్ర‌త్యేక హోదా అంశం ద్వారా ఇరుకున పెట్టేందుకు చంద్ర‌బాబు ప్లాన్ చేశార‌ని స‌మాచారం. ఇందులో భాగంగానే త‌న రాజ‌కీయ బినామీలుగా ఉండే కొంద‌రు మేధావులను రంగంలోకి దింపార‌ని బీజేపీ నేత‌లు అనుమానం వ్య‌క్తం […]

Advertisement
Update: 2016-05-08 23:27 GMT

రాయ‌ల‌సీమ‌లో ఇటీవ‌ల టీడీపీకి బీజేపీ నేత‌లు చికాకు క‌లిగిస్తున్నారు. రాయ‌ల‌సీమ నీటి కోసం అంటూ, క‌రువు అధ్య‌య‌నం అంటూ టీడీపీని ఇరుకున పెడుతున్నారు. దీంతో బీజేపీ నేత‌ల ఎత్తుకు విరుగుడు చంద్ర‌బాబు కొత్త ఎత్తువేశార‌ని చెబుతున్నారు. సీమ‌లో త‌మ‌ను ఇబ్బంది పెడుతున్న క‌మ‌ల‌నాథుల‌కు ప్ర‌త్యేక హోదా అంశం ద్వారా ఇరుకున పెట్టేందుకు చంద్ర‌బాబు ప్లాన్ చేశార‌ని స‌మాచారం. ఇందులో భాగంగానే త‌న రాజ‌కీయ బినామీలుగా ఉండే కొంద‌రు మేధావులను రంగంలోకి దింపార‌ని బీజేపీ నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

మేధావుల ముసుగులో చంద్ర‌బాబుకు అనుకూలంగా ప‌నిచేసే మేధావి బృందం ఇప్ప‌టికే రంగంలోకి దిగింది. ప్ర‌త్యేక హోదా కోసం జ‌నంలో చైత‌న్యం క‌లిగిస్తామంటూ సీమ‌లో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. క‌రువు, సాగునీటి స‌మ‌స్య‌ల ద్వారా సీమ‌లో ప‌ట్టుకోసం బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తుండగా… అందుకు విరుగుడుగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని మేధావి బృందం ద్వారా చంద్ర‌బాబు న‌డిపిస్తున్నార‌ని భావిస్తున్నారు.

రాయ‌ల‌సీమ‌పై ప్రేమ ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌త్యేక హోదా రాక‌పోతే ఈ ప్రాంతం నాశ‌నం అయిపోతుంద‌ని ఆందోళ‌న చెందుతున్న స‌ద‌రు మేధావి బృందం.. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మ‌ట్టం 780 అడుగుల‌కు తీసుకెళ్తే ఎందుకు స్పందించ‌లేద‌ని బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. క‌నీస నీటిమ‌ట్టం 845 అడుగులు ఉంటేనే సీమ‌కు నీరందుతాయ‌న్న విష‌యం తెలిసి కూడా ప్ర‌భుత్వం ప‌నిగ‌ట్టుకుని నీటిని కిందికి వ‌దులుతుంటే మాట్లాడ‌ని మేధావులు ఇప్పుడు సీమ కోసం క‌న్నీరు కార్చ‌డం విచిత్రంగా వుందని సీమ బీజేపీ నేతలంటున్నారు. ప్రత్యేక హోదా వచ్చినా నిధులు, పరిశ్రమలు చంద్రబాబు సీమలో స్థాపించరన్న విషయం అందరికీ తెలుసని అంటున్నారు. నిజంగా రాయలసీమ మీద ప్రేమ ఉన్న వారు నీటి కోసం పోరాటం చేయాలంటున్నారు.

పైగా 13 జిల్లాలు ఉండ‌గా ఇత‌ర ప్రాంతానికి చెందిన మేధావి రాయ‌ల‌సీమ‌కు వ‌చ్చి ప్ర‌త్యేక హోదా ఉద్యమం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. చంద్ర‌బాబుకు రాజ‌కీయ బినామీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న మేధావి, మ‌రో సెల‌బ్రెటీ క‌లిసి ప్ర‌త్యేక హోదా విష‌యం తెర‌పైకి వ‌చ్చినా ప్ర‌తిసారి టీడీపీకి ఎలాంటి న‌ష్టం జరగకుండా హ‌డావుడి మొదలుపెడుతున్నార‌ని ఆరోపిస్తున్నారు.

click on Image to Read:

Tags:    
Advertisement

Similar News