కావలి ఎమ్మెల్యే, ప.గో అధ్య‌క్షుడిపైనా వలేశారు

కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శనివారం టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఫిరాయింపు కార్యక్రమానికి అవసరమైన సభా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ పర్యవేకించారు.  మరో వైపు  నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా టీడీపీలో చేరున్నట్టు వార్తలొస్తున్నాయి. శుక్రవారం చంద్రబాబును ఆయన కలిసి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టు ఒక దినపత్రక కథనం. పశ్చిమగోదావరి […]

Advertisement
Update: 2016-05-07 22:36 GMT

కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శనివారం టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఫిరాయింపు కార్యక్రమానికి అవసరమైన సభా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ పర్యవేకించారు. మరో వైపు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా టీడీపీలో చేరున్నట్టు వార్తలొస్తున్నాయి.

శుక్రవారం చంద్రబాబును ఆయన కలిసి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టు ఒక దినపత్రక కథనం. పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడిపైనా టీడీపీ వలేసిందని కథనం. కొత్తపల్లి టీడీపీలో చేరేందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు.

కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో టీడీపీకి చెందిన వారే. చంద్రబాబు కేబినెట్లో విద్యుత్ శాఖ మంత్రిగానూ పనిచేసేశారు. గోదావరి జిల్లాల్లో వైసీపీ ఏమాత్రం పుంజుకున్నా టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయమన్న భావనతోనే ఆ రెండు జిల్లాల నేతలపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెబుతున్నారు. అందుకే వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని భావిస్తున్నారట.

click to read-

Tags:    
Advertisement

Similar News