ప్రశ్నించు!... పవన్ కోసం పంటపొల్లాల్లో ఫ్లెక్సీలు

ఏపీ రాజధాని బాధిత రైతులు మరోసారి ఆందోళనబాట పట్టారు. తమ భూములను లాక్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నికల సమయంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ స్పందించాలంటూ ఉండవల్లి, పెనుమాక రైతులు తమ పంట పొలాల్లో పవన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బలవంతపు భూసేకరణపై పవన్ నోరు విప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాము భూములు ఇవ్వబోమని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం వేధిస్తూనే ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. […]

Advertisement
Update: 2016-05-05 01:32 GMT

ఏపీ రాజధాని బాధిత రైతులు మరోసారి ఆందోళనబాట పట్టారు. తమ భూములను లాక్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ స్పందించాలంటూ ఉండవల్లి, పెనుమాక రైతులు తమ పంట పొలాల్లో పవన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ బలవంతపు భూసేకరణపై పవన్ నోరు విప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాము భూములు ఇవ్వబోమని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం వేధిస్తూనే ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదని, సబ్సిడీలను కూడా ఎత్తివేశారని అంటున్నారు. చంద్రబాబుతో కలిసి ప్రచారం చేసి టీడీపీకి ఓట్లు వేయించిన పవన్ ఇప్పటికైనా సరైన రీతిలో స్పందించాలని పెనుమాక, ఉండవల్లి రైతులు తన పొలాల్లోని చెట్లకు ఫ్లెక్సీలు వేలాడదీశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News