బీజేపీ,మోదీకి గోరంట్ల గట్టి హెచ్చరిక

ఢిల్లీలో ఏమో గానీ గల్లీల్లో మాత్రం టీడీపీ నేతలు బీజేపీపై గట్టిగా మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే బీజేపీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామంటూ ఇటీవల టీడీపీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ హెచ్చరించడం దుమారమే రేపింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఏపీని నిర్లక్ష్యం చేస్తే  కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకీ పడుతుందని హెచ్చరించారు. తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతింటే ఇందిరా, సోనియా గాంధీలకు […]

Advertisement
Update: 2016-05-02 10:15 GMT

ఢిల్లీలో ఏమో గానీ గల్లీల్లో మాత్రం టీడీపీ నేతలు బీజేపీపై గట్టిగా మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే బీజేపీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామంటూ ఇటీవల టీడీపీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ హెచ్చరించడం దుమారమే రేపింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఏపీని నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకీ పడుతుందని హెచ్చరించారు. తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతింటే ఇందిరా, సోనియా గాంధీలకు పట్టిన గతే రేపు మరో నాయకుడికీ పడుతుందంటూ పరోక్షంగా మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోవద్దని బీజేపీకి హితవు పలికారు.

మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లోక్‌సభ జీవో అవర్‌లో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రత్యేకంగా చూడాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు .

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News