‘’అది కూడా చూస్తాం మైసూరా!’’- పెద్దిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీకి రాజీనామా చేస్తూ జగన్‌పై మైసూరారెడ్డి చేసిన విమర్శల పట్ల వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు.  ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మైసూరారెడ్డి చేత టీడీపీయే లేఖ రాయించిందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై తాము పుస్తకం విడుదల చేసిన వెంటనే పద్దతి ప్రకారం మైసూరారెడ్డి చేత జగన్‌పై విమర్శలు చేస్తూ టీడీపీ నాయకత్వం లేఖ రాయించిందని పెద్ది రెడ్డి ఆరోపించారు. తనకు రాజకీయాల మీద ధ్యాస లేదని…ఇకపై వ్యాసాలు […]

Advertisement
Update: 2016-04-27 06:35 GMT

వైసీపీకి రాజీనామా చేస్తూ జగన్‌పై మైసూరారెడ్డి చేసిన విమర్శల పట్ల వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మైసూరారెడ్డి చేత టీడీపీయే లేఖ రాయించిందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై తాము పుస్తకం విడుదల చేసిన వెంటనే పద్దతి ప్రకారం మైసూరారెడ్డి చేత జగన్‌పై విమర్శలు చేస్తూ టీడీపీ నాయకత్వం లేఖ రాయించిందని పెద్ది రెడ్డి ఆరోపించారు.

తనకు రాజకీయాల మీద ధ్యాస లేదని…ఇకపై వ్యాసాలు రాసుకుంటానని మైసూరారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పెద్దిరెడ్డి… చూస్తాం అది కూడా చూస్తాం.. వ్యాసాలు రాసుకుంటారో కొద్ది రోజులు ఆగి టీడీపీలో చేరుతారో అది కూడా చూస్తామన్నారు. జగన్‌ను అపరిచితుడిగా మైసూరారెడ్డి అభివర్ణించడాన్ని పెద్దిరెడ్డి తప్పుపట్టారు. మైసూరారెడ్డి లాంటి సీనియర్ నేతలు వాడాల్సిన పదాలేనా అవి అని ప్రశ్నించారు. మైసూరారెడ్డి అపరిచితుడు కాబట్టే పదేపదే పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేవారు.

బ్రేక్ ఫాస్ట్‌కు పిలిచి జగన్ పార్టీ కండువా వేశారని మైసూరారెడ్డి చెప్పడం నవ్వులాటలా ఉందన్నారు. తమ్ముడి కుమారుడిని జమ్మలమడుగు వైసీపీ ఇన్‌చార్జ్‌గా నియమించడాన్ని మైసూరారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని… అలాంటి వ్యక్తి జగన్‌ కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నారని ఆరోపించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News