షాపులకు నిప్పు పెట్టిన ఏసీపీ పుత్రరత్నం

సికింద్రాబాద్ ఆల్పా హోటల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున పదుల సంఖ్యలో దుకాణాలు తగలబడిపోయాయి. తొలుత అందరూ ఇది ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని భావించారు. కానీ సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. మాదాపూర్ ఎనిమిదో బెటాలియన్‌కు చెందిన ఏసీపీ హనుమంతరావు కుమారుడు చిరంజీవియే షాపులకు నిప్పు పెట్టినట్టు తేలింది. బైక్‌పై వచ్చిన చిరంజీవి అతడి స్నేహితుడు నిప్పు రాజేసి వెళ్లినట్టు గుర్తించారు. చిరంజీవిని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో తాము ఈ పనిచేసినట్టు నిందితులు […]

Advertisement
Update: 2016-04-19 22:38 GMT

సికింద్రాబాద్ ఆల్పా హోటల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున పదుల సంఖ్యలో దుకాణాలు తగలబడిపోయాయి. తొలుత అందరూ ఇది ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని భావించారు. కానీ సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. మాదాపూర్ ఎనిమిదో బెటాలియన్‌కు చెందిన ఏసీపీ హనుమంతరావు కుమారుడు చిరంజీవియే షాపులకు నిప్పు పెట్టినట్టు తేలింది. బైక్‌పై వచ్చిన చిరంజీవి అతడి స్నేహితుడు నిప్పు రాజేసి వెళ్లినట్టు గుర్తించారు. చిరంజీవిని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో తాము ఈ పనిచేసినట్టు నిందితులు అంగీకరించారని సమాచారం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News