తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కురసాలకే పగ్గాలు

తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఇదివరకు వున్న జ్యోతుల నెహ్రూ పార్టీ వీడడంతో కొత్త అధ్యక్షుడిని వైసీపీ నాయకత్వం ప్రకటించింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకే పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈయన ప్రజారాజ్యం తరుపున 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలే వైసీపీలో చేరారు. కన్నబాబు చిరంజీవికి సన్నిహితుడిగా వుండేవారు. గతంలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు. కాపుసామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూ పార్టీ వీడడంతో ఆ సామాజిక వర్గంపై ఉన్న పట్టు […]

Advertisement
Update: 2016-04-16 05:17 GMT

తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఇదివరకు వున్న జ్యోతుల నెహ్రూ పార్టీ వీడడంతో కొత్త అధ్యక్షుడిని వైసీపీ నాయకత్వం ప్రకటించింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకే పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈయన ప్రజారాజ్యం తరుపున 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలే వైసీపీలో చేరారు. కన్నబాబు చిరంజీవికి సన్నిహితుడిగా వుండేవారు. గతంలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు. కాపుసామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూ పార్టీ వీడడంతో ఆ సామాజిక వర్గంపై ఉన్న పట్టు తగ్గకుండా వుండేందుకే అదే సామాజిక వర్గానికి చెందిన కన్నబాబుకు అవకాశం ఇచ్చినట్టు భావిస్తున్నారు. జిల్లా పరిషత్‌ వైయస్‌ఆర్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌గా సాకేత్‌ ప్రసన్నకుమార్‌ని నియమించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News