బాబు పక్కనే బజ్జున్న బొండా, గద్దె, కేశినేని

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి వేడుక. జరుగుతున్నది విజయవాడలో.  టీడీపీ ఆధ్వర్యంలో. సీఎం కూడా వచ్చారు. సాధారణంగా అయితే సీఎం వచ్చిన ఇంతముఖ్యమైన కార్యక్రమంలో అందరూ అప్రమత్తంగా ఉంటారు. సీఎం ఏం చెబుతారో అని అందరూ శ్రద్ధగా అటెన్షన్‌లో ఉంటారు. కానీ  విజయవాడలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో మాత్రం సీన్ అందుకు రివర్స్‌లో కనిపించింది. టీడీపీ ప్రజాప్రతినిధులు ఎంచక్కా వేదిక మీదే బజ్జున్నారు.  అది కూడా సీఎం చంద్రబాబు … అంబేద్కర్‌ గొప్పతనం గురించి వివరిస్తున్న […]

Advertisement
Update: 2016-04-14 08:44 GMT

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి వేడుక. జరుగుతున్నది విజయవాడలో. టీడీపీ ఆధ్వర్యంలో. సీఎం కూడా వచ్చారు. సాధారణంగా అయితే సీఎం వచ్చిన ఇంతముఖ్యమైన కార్యక్రమంలో అందరూ అప్రమత్తంగా ఉంటారు. సీఎం ఏం చెబుతారో అని అందరూ శ్రద్ధగా అటెన్షన్‌లో ఉంటారు. కానీ విజయవాడలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో మాత్రం సీన్ అందుకు రివర్స్‌లో కనిపించింది.

టీడీపీ ప్రజాప్రతినిధులు ఎంచక్కా వేదిక మీదే బజ్జున్నారు. అది కూడా సీఎం చంద్రబాబు … అంబేద్కర్‌ గొప్పతనం గురించి వివరిస్తున్న సమయంలోనే ఇది జరిగింది. సీఎం ప్రసంగం మొదలుపెట్టినప్పుడు బాగానే ఉన్న బొండా ఉమా, కేశినేని నాని, గద్దె రామోహ్మన్‌, ఇతర టీడీపీ నాయకులు కాసేపటికి కునుకు పాట్లకు లోనయ్యారు.

ముందే సీఎం ప్రసంగం కదా… సుధీర్ఘంగా సాగుతోంది. దీంతో నిద్రను భరించలేక నేతలంతా వేదికపైనే, అది కూడా చంద్రబాబుకు మూడునాలుగు అడుగుల దూరంలోనే నిద్రపోయారు. చంద్రబాబు ప్రసంగం అయిపోయి అందరూ ఒక్కసారిగా పైకి లేచేవరకూ నేతలు తేరుకోలేకపోయారు. నేతలు పక్కనే నిద్రపోతున్నా దాన్ని పట్టించుకోని చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News