ప్రాణం పోయినా టీడీపీలో చేరను... దమ్ముంటే సీఎంని కలిసినట్టు నిరూపించండి

వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యం తమ క్యారెక్టర్‌ను నిరూపించుకోవాల్సి వస్తోంది. పలానా ఎమ్మెల్యే పార్టీ వీడుతున్నట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావడం, సదరు ఎమ్మెల్యేలు ఉలిక్కి పడడం కామన్‌ అయిపోయింది. తాజాగా కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు పై ఇలాంటి కథనాలే వచ్చాయి. అప్పారావు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రతాప్‌ తీవ్రంగా ఖండించారు. ప్రాణం పోయినా టీడీపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన కుమారుడు […]

Advertisement
Update: 2016-04-07 03:10 GMT

వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యం తమ క్యారెక్టర్‌ను నిరూపించుకోవాల్సి వస్తోంది. పలానా ఎమ్మెల్యే పార్టీ వీడుతున్నట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావడం, సదరు ఎమ్మెల్యేలు ఉలిక్కి పడడం కామన్‌ అయిపోయింది. తాజాగా కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు పై ఇలాంటి కథనాలే వచ్చాయి. అప్పారావు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రతాప్‌ తీవ్రంగా ఖండించారు. ప్రాణం పోయినా టీడీపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన కుమారుడు సీఎం చంద్రబాబును కలిసినట్టు ప్రచారం జరగడంపై ఆయన మండిపడ్డారు. దమ్ముంటే తన కుమారుడు సీఎంని కలిసినట్టు నిరూపించాలని అప్పారావు సవాలు చేశారు.

రాష్ట్రంలో ఎల్లోమీడియా పనిగట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. తాను ప్రభుత్వానికి భయపడి లొంగిపోయేరకం కాదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News