జగన్‌పై పరువు నష్టం దావా !

వంగవీటి రంగా హత్య కేసులో హస్తముందంటూ ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ నేత, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు… వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్రంగా స్పందించారు. జగన్‌పై పరువునష్టం దావా వేస్తానని ప్రకటించారు.  వంగవీటి రంగా హత్య కేసులో తన ప్రమేయం ఉందంటూ జగన్ అసత్య ఆరోపణలు చేశారని అందుకే పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. 2002లోనే కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. కోర్టు తీర్పు తర్వాత కూడా తనపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు […]

Advertisement
Update: 2016-02-04 09:35 GMT

వంగవీటి రంగా హత్య కేసులో హస్తముందంటూ ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ నేత, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు… వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్రంగా స్పందించారు. జగన్‌పై పరువునష్టం దావా వేస్తానని ప్రకటించారు. వంగవీటి రంగా హత్య కేసులో తన ప్రమేయం ఉందంటూ జగన్ అసత్య ఆరోపణలు చేశారని అందుకే పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. 2002లోనే కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. కోర్టు తీర్పు తర్వాత కూడా తనపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తమకు నారా చంద్రబాబు హత్య రాజకీయాలను నేర్పించలేదన్నారు. వెలగపూడి రామకృష్ణపై వంగవీటి రంగా హత్య కేసులో ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే. కేసులో ఆయనను నిందితుడిగా కూడా చేర్చారు. రంగా హత్య తర్వాత రామకృష్ణ విజయవాడ వదిలి విశాఖ వెళ్లారని చెబుతుంటారు. అక్కడే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. రంగా హత్య కేసులో వెలగపూడి హస్తముందని ఒక్క జగనే కాకుండా చాలా మంది విమర్శిస్తుంటారు.

Click on image to Read

 

 

Tags:    
Advertisement

Similar News