రెండు లారీల్లో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం

కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల మండలం నేరెళ్ళలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. అత్యంత వేగంగా ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే రెండు లారీల క్యాబిన్‌లలో మంటలు చెలరేగాయా. దీంతో ఈ ఇసుక లారీలు రెండూ దగ్గమయ్యాయి. ఇందులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు బయటకి రాలేని పరిస్థితిలో సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి […]

Advertisement
Update: 2015-11-06 17:01 GMT

కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల మండలం నేరెళ్ళలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. అత్యంత వేగంగా ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే రెండు లారీల క్యాబిన్‌లలో మంటలు చెలరేగాయా. దీంతో ఈ ఇసుక లారీలు రెండూ దగ్గమయ్యాయి. ఇందులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు బయటకి రాలేని పరిస్థితిలో సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి వెళ్ళి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News