ఇండస్‌ కాఫీ ఫ్యాక్టరీలో ప్రమాదం...ముగ్గురు దుర్మరణం

నెల్లూరు జిల్లాలోని మాంబట్టు పారిశ్రామికవాడలో విషాదం చోటు చేసుకుంది. సెజ్‌లోని ఇండస్‌ కాఫీపొడి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఫ్యాక్టరీలో సుమారు రెండు వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. అకస్మాత్తుగా బాయిలర్‌‌ వద్ద మంటలు చెలరేగడంతో అందులో ఐదుగురు కార్మికులు పడిపోయారు. వీరిలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న […]

Advertisement
Update: 2015-09-08 05:00 GMT
నెల్లూరు జిల్లాలోని మాంబట్టు పారిశ్రామికవాడలో విషాదం చోటు చేసుకుంది. సెజ్‌లోని ఇండస్‌ కాఫీపొడి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఫ్యాక్టరీలో సుమారు రెండు వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. అకస్మాత్తుగా బాయిలర్‌‌ వద్ద మంటలు చెలరేగడంతో అందులో ఐదుగురు కార్మికులు పడిపోయారు. వీరిలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు!
Tags:    
Advertisement

Similar News