కలాం అంత్యక్రియలకు జయలలిత దూరం

మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం అంత్యక్రియలకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరు కావడం లేదు. అనారోగ్యం కారణంగా తాను హాజరుకాలేక పోతున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం తరపున పన్నీర్‌ సెల్వం సహా ఇతర మంత్రులందరూ కలాం అంత్యక్రియలకు హాజరవుతారని ఆమె వెల్లడించారు. డాక్టర్ అబ్దుల్ కలాంతో సత్సంబంధాలున్న జయలలిత, ఆయన్ని రాష్ట్రపతి పదవిలో రెండవసారి చూడాలని ఎంతో కోరుకున్నారు. అయితే అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం.. దానికి తోడు కేంద్ర రాష్ట్రాల చట్టసభల్లో […]

Advertisement
Update: 2015-07-29 01:43 GMT
మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం అంత్యక్రియలకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరు కావడం లేదు. అనారోగ్యం కారణంగా తాను హాజరుకాలేక పోతున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం తరపున పన్నీర్‌ సెల్వం సహా ఇతర మంత్రులందరూ కలాం అంత్యక్రియలకు హాజరవుతారని ఆమె వెల్లడించారు. డాక్టర్ అబ్దుల్ కలాంతో సత్సంబంధాలున్న జయలలిత, ఆయన్ని రాష్ట్రపతి పదవిలో రెండవసారి చూడాలని ఎంతో కోరుకున్నారు. అయితే అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం.. దానికి తోడు కేంద్ర రాష్ట్రాల చట్టసభల్లో బిజెపి, జయ కూటమికి తగినంత బలం లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.
Tags:    
Advertisement

Similar News