విశాఖలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులకు ఇఫ్తార్‌ విందు

ముస్లిమ్‌లకు అతిపవిత్రమైన ఖురాన్‌ గ్రంథం అవతరించిన పవిత్రమాసం రంజాన్‌ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.  మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలోని తారా మసీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ మాసంలో నియమనిష్టలతో ఉపవాసం ఉండి నమాజ్‌ చేయడంలో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి అని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ నమాజ్‌చేయడం వల్ల […]

Advertisement
Update: 2015-07-15 04:43 GMT

ముస్లిమ్‌లకు అతిపవిత్రమైన ఖురాన్‌ గ్రంథం అవతరించిన పవిత్రమాసం రంజాన్‌ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలోని తారా మసీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ మాసంలో నియమనిష్టలతో ఉపవాసం ఉండి నమాజ్‌ చేయడంలో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి అని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ నమాజ్‌చేయడం వల్ల దైవాజ్ఞను ఆచరించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ముస్లిమ్‌ సోదరులతో కలిసి రాష్ట్ర ప్రధానకార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌, రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఫరూఖీ తదితర వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఈ ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News