వరల్డ్ నంబర్వన్ సైనా నెహ్వల్
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ నెంబర్ ఒన్ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది. ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మారిన్ అనే క్రీడాకారిణి మీద సైనా విజయం సాధించడంతో గేమ్ విజయంతోపాటు, వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు కూడా సైనా దక్కించుకోగలిగింది. దీంతో ట్విట్టర్లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ “ప్రపంచ నెంబర్ 1 […]
Advertisement
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ నెంబర్ ఒన్ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది. ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మారిన్ అనే క్రీడాకారిణి మీద సైనా విజయం సాధించడంతో గేమ్ విజయంతోపాటు, వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు కూడా సైనా దక్కించుకోగలిగింది. దీంతో ట్విట్టర్లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ “ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన సైనాకు అభినందనలు, ఆమెకు ఈ గౌరవం దక్కడం దేశం గర్వంచదగిన అంశం” అని ట్విట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడితోపాటు అనేకమంది ప్రముఖులు సైనాను పొగడ్తలతో ముంచెత్తారు. ఇంకా పలువురు విఐపీలు, క్రీడాభిమానులు కూడా సైనా నెహ్వల్ కు అభినందనలు తెలుపుతూ సోషల్ వెబ్సైట్లలో పొగడ్తల వర్షం కురిపించారు.-పిఆర్
Advertisement