కేంద్రం బెదిరింపులతో బాబుకు జగన్‌ దాసోహం:ఆనం

నెల్లూరు: కేసులు, కుంభకోణాల్లో ఇరుక్కున్న వారు రాజకీయాలకు పనికిరారని జగన్మోహన్‌రెడ్డి నిరూపించారని పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం బెదిరింపులతో హడలిపోయిన జగన్‌ పట్టిసీమ వజ్రాయుధాన్ని చంద్రబాబుకు అప్పజెప్పి అసెంబ్లీ నుంచి పారిపోయారని అన్నారు. ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్ష నేత శాసనసభ నుంచి అలిగి వెళ్లిపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పోలవరానికి ముప్పుగా మారిన పట్టిసీమ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని నిలదీసి అడ్డుకోవాల్సి ఉండగా అంతటి సమస్యను గాలికొదిలేసి కేసుల భయంతో కేంద్రానికి తలొగ్గి చంద్రబాబుతో లాలూచీపడ్డాడని […]

Advertisement
Update: 2015-03-25 22:14 GMT

నెల్లూరు: కేసులు, కుంభకోణాల్లో ఇరుక్కున్న వారు రాజకీయాలకు పనికిరారని జగన్మోహన్‌రెడ్డి నిరూపించారని పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం బెదిరింపులతో హడలిపోయిన జగన్‌ పట్టిసీమ వజ్రాయుధాన్ని చంద్రబాబుకు అప్పజెప్పి అసెంబ్లీ నుంచి పారిపోయారని అన్నారు. ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్ష నేత శాసనసభ నుంచి అలిగి వెళ్లిపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పోలవరానికి ముప్పుగా మారిన పట్టిసీమ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని నిలదీసి అడ్డుకోవాల్సి ఉండగా అంతటి సమస్యను గాలికొదిలేసి కేసుల భయంతో కేంద్రానికి తలొగ్గి చంద్రబాబుతో లాలూచీపడ్డాడని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మీద ఉన్న అభిమానంతో కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆయన్ను ప్రజలు ఆదరించారని ఆ అభిమానాన్ని కూడా జగన్‌ పోగొట్టుకున్నారన్నారు.

Tags:    
Advertisement

Similar News