ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కర్నూలు: భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం అల్లుగుండులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మినీ వ్యాన్‌లో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ మినీ లారీలో దాదాపు 50 వరకు ఎర్ర చందనం దుంగలున్నాయని, వీటి విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. దుంగలను రవాణా చేస్తున్న వ్యాన్ డ్రైవర్‌ పోలీసులను చూసి పరారయ్యాడు.

Advertisement
Update: 2015-03-25 21:55 GMT

కర్నూలు: భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం అల్లుగుండులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మినీ వ్యాన్‌లో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ మినీ లారీలో దాదాపు 50 వరకు ఎర్ర చందనం దుంగలున్నాయని, వీటి విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. దుంగలను రవాణా చేస్తున్న వ్యాన్ డ్రైవర్‌ పోలీసులను చూసి పరారయ్యాడు.

Tags:    
Advertisement

Similar News