Telugu Global
NEWS

టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్ కు భారత్ గురి

వరుసగా మూడో విజయానికి భారత్ తహతహ తొలిరౌండ్లో న్యూజిలాండ్ పై భారీవిజయం రెండోరౌండ్లో పాకిస్థాన్ పై అలవోక విజయం మూడో రౌండ్లో ఇక ఐర్లాండ్ తో భారత్ పోటీ టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్ బెర్త్ కు… మాజీ సెమీ ఫైనలిస్ట్ భారత్ ఉరకలేస్తోంది. కరీబియన్ ద్వీపాలలోని గయానా వేదికగా జరుగుతున్న గ్రూప్- బీ లీగ్ లో ఇప్పటికే రెండో ర్యాంక్ న్యూజిలాండ్, 7వ ర్యాంక్ పాకిస్థాన్ జట్లను ఊదిపారేసిన భారత మహిళల జట్టు ..విజయాల హ్యాట్రిక్ కు […]

టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్ కు భారత్ గురి
X
  • వరుసగా మూడో విజయానికి భారత్ తహతహ
  • తొలిరౌండ్లో న్యూజిలాండ్ పై భారీవిజయం
  • రెండోరౌండ్లో పాకిస్థాన్ పై అలవోక విజయం
  • మూడో రౌండ్లో ఇక ఐర్లాండ్ తో భారత్ పోటీ

టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్ బెర్త్ కు… మాజీ సెమీ ఫైనలిస్ట్ భారత్ ఉరకలేస్తోంది. కరీబియన్ ద్వీపాలలోని గయానా వేదికగా జరుగుతున్న గ్రూప్- బీ లీగ్ లో ఇప్పటికే రెండో ర్యాంక్ న్యూజిలాండ్, 7వ ర్యాంక్ పాకిస్థాన్ జట్లను ఊదిపారేసిన భారత మహిళల జట్టు ..విజయాల హ్యాట్రిక్ కు సిద్ధమయ్యింది.

గయానా ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే మూడో రౌండ్ పోటీలో…10వ ర్యాంకర్ ఐర్లాండ్ పని పట్టడానికి భారత్ సై అంటోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, మిడిలార్డర్ ప్లేయర్ వేద, యువప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్… పూర్తిఫామ్ లో ఉండడంతో… భారత్ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా మారింది.

ఐర్లాండ్ పై భారీ విజయంతో…. ప్రపంచకప్ సెమీస్ చేరాలన్న పట్టుదలతో హర్మన్ ప్రీత్ టీమ్ ఉంది. ఈనెల 17న ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి రౌండ్ మ్యాచ్ తో లీగ్ పోటీలను భారత్ ముగించనుంది.

First Published:  13 Nov 2018 8:10 AM GMT
Next Story