Telugu Global
Telangana

మెట్రో స్టేషన్ల వద్ద నేడు వైసీపీ నిరసన..

'వుయ్ ఆర్ విత్ సీబీఎన్' అంటూ టీడీపీ సానుభూతి పరులు నిన్న నిరసన ప్రదర్శన చేపడితే.. 'వుయ్ అగైనెస్ట్ సీబీఎన్' అంటూ ఈరోజు వైసీపీ స్లోగన్లు అందుకుంది.

మెట్రో స్టేషన్ల వద్ద నేడు వైసీపీ నిరసన..
X

మెట్రో స్టేషన్ల వద్ద నేడు వైసీపీ నిరసన..

చంద్రబాబుకి మద్దతుగా మెట్రో స్టేషన్ల వద్ద టీడీపీ చేసిన రచ్చ తెలిసిందే. రైల్వే స్టేషన్ల ముందు ప్రదర్శనలు చేపట్టడమే కాకుండా, నల్ల దుస్తులు ధరించి మెట్రో ఎక్కి తమ నిరసన తెలియజేశారు టీడీపీ నేతలు, అభిమానులు. టీడీపీ సోషల్ మీడియా కథనాల ప్రకారం ఈ ప్రదర్శన సూపర్ హిట్. వైసీపీ సానుభూతిపరుల మాటల్లో చెప్పాలంటే ఇది అట్టర్ ఫ్లాప్. అడుగడుగునా ప్రయాణికులు టీడీపీ నేతల్ని అడ్డుకున్నారని అందుకే ఈ కార్యక్రమం అనుకున్నంత సక్సెస్ కాలేదని, నలుగురైదుగురు మాత్రమే నల్ల చొక్కాలు వేసుకుని మెట్రో స్టేషన్ల వద్ద హడావిడి చేశారని అంటున్నారు వైసీపీ నేతలు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఈరోజు వైసీపీ సానుభూతిపరులు మెట్రో స్టేషన్ల వద్ద హడావిడి చేయడం విశేషం.


వుయ్ అగైనెస్ట్ సీబీఎన్

వుయ్ ఆర్ విత్ సీబీఎన్ అంటూ టీడీపీ సానుభూతి పరులు నిన్న నిరసన ప్రదర్శన చేపడితే.. వుయ్ అగైనెస్ట్ సీబీఎన్ అంటూ ఈరోజు వైసీపీ స్లోగన్లు అందుకుంది. కరప్షన్ కింగ్ చంద్రబాబు అనే ప్లకార్డులు పట్టుకుని KPHB మెట్రో స్టేషన్ ముందు వైసీపీ సానుభూతిపరులు రచ్చ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చంద్రబాబు అభిమానులే కాదు, వైసీపీ సానుభూతిపరులు కూడా హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఉన్నారని నిరూపించేందుకు ఈరోజు కొంతమంది నిరసన ప్రదర్శన చేపట్టారు.

హైదరాబాద్ లో ఏంటీ రచ్చ..?

ఈ నిరసనలు ఎలా ఉన్నా.. వీరి గొడవని మాత్రం కొంతమంది తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు హైదరాబాద్ లో ఏంటీ రచ్చ అని ప్రశ్నిస్తున్నారు. పోయి మీ రాష్ట్రంలో నిరసనలు చేసుకోండి అంటూ సూచిస్తున్నారు. టీడీపీ, వైసీపీ మధ్య ఉన్న గొడవకి, ఆధిపత్యపోరుకి.. హైదరాబాద్ కి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రం రాజకీయాలకోసం హైదరాబాద్ ప్రశాంతతను దెబ్బతీయొద్దని, హైదరాబాద్ వాసులను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నారు.

First Published:  15 Oct 2023 5:30 AM GMT
Next Story