Telugu Global
Telangana

కేటీఆర్ ప్రసంగంతో వైసీపీ ఫుల్ ఖుషీ..

వైఎస్ఆర్ హయాంలో మొదలైన పనుల్ని కూడా గుర్తు చేశారు కేటీఆర్. వైఎస్ఆర్ ని గుర్తు చేయడంతోపాటు, చంద్రబాబుపై సెటైర్లు వేయడంతో వైసీపీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి.

కేటీఆర్ ప్రసంగంతో వైసీపీ ఫుల్ ఖుషీ..
X

అవును, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇటు ఏపీలో కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. ముఖ్యంగా శనివారం సభలో కేటీఆర్ ప్రసంగంతో వైసీపీ ఫుల్ ఖుషీగా అయిపోయింది. ఆరోగ్యశ్రీకి ఆద్యుడు వైఎస్ఆర్ అని కేటీఆర్ చెప్పడం వైసీపీలో సంతోషాన్ని నింపింది. అదే సమయంలో కేటీఆర్ పరోక్షంగా చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు. హోల్ సేల్ గా పరువు తీశారు. ఆ వీడియోని ఇప్పుడు వైసీపీ వైరల్ చేస్తోంది. చంద్రబాబుని చెడుగుడు ఆడుకున్న కేటీఆర్ అంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆ వీడియోతో సంబరాలు చేసుకుంటోంది.


ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు..?

హైదరాబాద్ ని తానే అభివృద్ధి చేశానని చెప్పుకునే ఓ పెద్దమనిషి గతంలో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆయన ఓసారి ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్లినప్పుడు చిన్న సంఘటన జరిగిందని అసెంబ్లీలో చెప్పారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ని తానే నిర్మించానంటూ ఆ సీఎం అక్కడున్న ఓ వ్యక్తితో చెప్పాడని.. గతంలో తనకు కూడా ఇలాంటి ఆలోచనలే వచ్చేవని, ఎర్రగడ్డ ఆస్పత్రిలో మందులు వాడాక నయమైపోయిందని ఆ వ్యక్తి బదులిచ్చాడని కేటీఆర్ వివరించారు. ఆ కథ చెప్పి అప్పటి ముఖ్యమంత్రి పరువు తీశారు. అయితే ఇక్కడ కేటీఆర్, ఆ ముఖ్యమంత్రి పేరు మాత్రం చెప్పలేదు. చెప్పకపోయినా సోషల్ మీడియాలో చంద్రబాబు పేరు మారుమోగిపోయింది.

తెలంగాణ అభివృద్ధి అంతా తామే చేశామని చెప్పడంలేదని, గతంలో కూడా కొన్ని మంచి పనులు జరిగాయని ఆవిషయాన్ని ఒప్పుకోడానికి తామేమీ ఇబ్బంది పడబోమన్నారు కేటీఆర్. వైఎస్ఆర్ హయాంలో మొదలైన పనుల్ని కూడా గుర్తు చేశారు కేటీఆర్. వైఎస్ఆర్ ని గుర్తు చేయడంతోపాటు, చంద్రబాబుపై సెటైర్లు వేయడంతో వైసీపీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి.

First Published:  6 Aug 2023 5:29 AM GMT
Next Story