Telugu Global
Telangana

సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ షర్మిల ఆగ్రహం!

సజ్జల వ్యాఖ్యలు అర్దంలేనివని, ఆ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల అన్నారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని చెప్పిన షర్మిల రెండు రాష్ట్రాలు మళ్ళీ కలవడం అసాధ్యమన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ షర్మిల ఆగ్రహం!
X

మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడతామంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆమె వ్యాఖ్యానించారు.

సజ్జల వ్యాఖ్యలు అర్దంలేనివని, ఆ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల అన్నారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని చెప్పిన షర్మిల రెండు రాష్ట్రాలు మళ్ళీ కలవడం అసాధ్యమన్నారు. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు? అని ఆమె సజ్జలను ప్రశ్నించారు.

''మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు.'' అని ఆమె హితవు పలికారు

First Published:  8 Dec 2022 2:20 PM GMT
Next Story