Telugu Global
Telangana

నువ్వే గెలుస్తున్నవ్.. ఈటలతో మల్లారెడ్డి కామెంట్స్ వైరల్

మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి మల్లారెడ్డి కండ్లకోయలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు.

నువ్వే గెలుస్తున్నవ్.. ఈటలతో మల్లారెడ్డి కామెంట్స్ వైరల్
X

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే మల్లారెడ్డి సరదాగా చేశారో, సీరియస్‌గా చేశారో తెలియదు.. ఈ కామెంట్స్‌ గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి.

అసలేం జరిగింది..?

మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి మల్లారెడ్డి కండ్లకోయలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. ఈటల ఎదురుపడగానే మల్లారెడ్డి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అన్నా అంటూ ఈటలను ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్బంగా నేను గెలుస్తున్నానా అంటూ మల్లారెడ్డిని ఈటల ప్రశ్నించగా.. నువ్వే గెలుస్తున్నావ్ అన్నా.. డౌట్‌ ఏ లేదు.. నా కొడుకు టికెట్ గుంజుకున్నవ్ అంటూ మల్లారెడ్డి సమాధానం ఇచ్చారు.


ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో మల్లారెడ్డి... ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటలనే గెలుస్తున్నారంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

First Published:  27 April 2024 5:52 AM GMT
Next Story