Telugu Global
Telangana

ఇక కరెన్సీ నోట్లపై మోడీ బొమ్మలుంటాయా ? - KTR

త్వరలో ఇండియన్ కరెన్సీ నోట్ల పై నరేంద్ర మోడీ బొమ్మలు ముద్రించమని RBI ఆదేశించవచ్చంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.

ఇక కరెన్సీ నోట్లపై మోడీ బొమ్మలుంటాయా ? - KTR
X

ప్రధాని నరేంద్ర మోడీపై, బీజేపీ సెటైర్లు వేయడంలో, విమర్శలు గుప్పించడం లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందుంటారు. ట్విట్టర్ లో ఫుల్ యాక్టీవ్ గా ఉండే కేటీఆర్ ప్రతి రోజూ అప్డేట్ గా ఉంటారు. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాల మీద ఒక వైపు ప్రచారం, మరో వైపు తమకు సహాయం చేయమంటూ ట్విట్టర్ ద్వారా ఆర్ధించే అనేక మంది ని ఆదుకోవడంతో పాటు బీజేపీ ని కూడా ఓ ఆటాడుకోవడంలో ఏ మాత్రం వెనకంజ వేయరు కేటీఆర్.

ఈ రోజు ఆయన నరేంద్ర మోడీ మీద చేసిన ట్వీట్ నెటిజనులను విపరీతంగా ఆకర్శించింది. అనేక షేర్లు కామెంట్లతో ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకూ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే....

''అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చారు

ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు

ఆర్థిక మంత్రి నిర్మలా జీకి తన మార్గం తనకు ఉంటే(రేషన్ షాపులో మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని ఆమె చేసిన రచ్చను ఉద్దేశించి), కరెన్సీ నోట్ల పై మహాత్మా గాంధీ ఫోటోల స్థానంలో మోడీ ఫోటోలతో కొత్త కరెన్సీ నోట్లను ముద్రించమని RBI త్వరలో ఆదేశించవచ్చు.'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

First Published:  16 Sep 2022 6:05 AM GMT
Next Story