Telugu Global
Telangana

కొత్త సచివాలయంపై ఉన్న డోములను కూల్చేస్తాం... బండిసంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

''మేము అధికారంలోకి వచ్చాక సచివాలయం పైన ఉన్న డోములను కూల్చివేస్తాం. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాన్ని మారుస్తాం'' అని బండి సంజయ్ అన్నారు.

కొత్త సచివాలయంపై ఉన్న డోములను కూల్చేస్తాం... బండిసంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

ఇష్టమొచ్చినట్టు మాట్లాడటంలో బీజేపీ నాయకులు ముందుంటారు. అయితే ఈ మధ్య కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా వీళ్ళబాటలోనే నడుస్తున్నాడనే వినర్శలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేయాలి అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మర్చిపోక ముందే కొత్త సెక్రటేరియట్ డోములు కూల్చేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

''మేము అధికారంలోకి వచ్చాక సచివాలయం పైన ఉన్న డోములను కూల్చివేస్తాం. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాన్ని మారుస్తాం'' అని బండి సంజయ్ అన్నారు.

అసెంబ్లీలో బీఆరెస్, ఎమ్ ఐ ఎమ్ కలిసి నాటకమాడుతున్నాయని రాష్ట్రాన్ని ఎమ్ ఐ ఎమ్ చేతులో పెట్టడానికి కేసీఆర్ కుట్ర‌ చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. రోడ్ల అభివృద్దికి రోడ్లపై ఉన్న గుడులు కూల్చేస్తామంటున్నారని, దమ్ముంటే ఓల్డ్ సిటీలో ఉన్న మసీదులు కూల్చాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.

బీఆరెస్, ఎమ్ ఐ ఎమ్ ఒకటే అని, దమ్ముంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని అప్పుడు వారికి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని సంజయ్ అన్నారు.

First Published:  10 Feb 2023 8:13 AM GMT
Next Story