Telugu Global
Telangana

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీని ఓడిస్తాం.. సీపీఐ నారాయణ

మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది తామే అని సీపీఐ నేత నారాయణ అన్నారు. బీజేపీ ని ఓడించడం కోసం ఎవరికి మద్దతివ్వాలో రేపు చెప్తామని ఆయన స్పష్టం చేశారు.

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీని ఓడిస్తాం.. సీపీఐ నారాయణ
X

మునుగోడు ఉపఎన్నిక లో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా.. సీపీఐ కూడా రంగంలోకి దిగింది. ఈ నియోజకవర్గంలో తమకు బలం ఉందని, ఇక్కడ జరిగే ఎన్నికలో గెలుపు..ఓటములను తామే డిసైడ్ చేస్తామని ఈ పార్టీ నేత నారాయణ ప్రకటించారు. తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని, టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు తమను సంప్రదిస్తున్నాయని ఆయన శుక్రవారం తెలిపారు. పార్టీలో అందరి అభిప్రాయాల ప్రకారం తమ నిర్ణయం ఉంటుందన్నారు. రేపు మధ్యాహ్నం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ ఎన్నికలో బీజేపీని ఓడిస్తామని, అదే తమ ధ్యేయమన్నారు. మునుగోడులో రేపు సీఎం కేసీఆర్, ఈ నెల 21 న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్న నేపథ్యంలో నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి ఈ ఎన్నికలో సీపీఐ ... టీఆరెస్ లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తుందా లేక ఒంటరిగానే పోటీ చేస్తుందా అన్న విషయం రేపు తేలిపోయే అవకాశాలున్నాయి.





First Published:  19 Aug 2022 11:53 AM GMT
Next Story