Telugu Global
Telangana

బంగారు తెలంగాణ కోసం ఓటెయ్యండి.. ఓటర్లకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి

సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజమౌళి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, రానా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బంగారు తెలంగాణ కోసం ఓటెయ్యండి.. ఓటర్లకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్ర‌జ‌లు, రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదు అవుతుండగా.. పట్టణాలు, గ్రామాల్లో మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. ఓటు వేసిన ప్రముఖులు ప్రజలంతా ఓటు వేయడానికి కదలి రావాలని మీడియా ముఖంగా పిలుపునిస్తున్నారు.

సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజమౌళి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, రానా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సోషల్ మీడియా వేదికగా కోరారు.


తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ చేశారు. 'నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. రండి అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటెయ్యండి. కాంగ్రెస్‌ను గెలిపించండి' అని ట్వీట్ చేశారు.

First Published:  30 Nov 2023 6:46 AM GMT
Next Story