Telugu Global
Telangana

మునుగోడు ఫలితంపై కిషన్ రెడ్డి వేదాంతం..

అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలిచి ఓడిందని, తాము మాత్రం ఓడి గెలిచామని వేదాంతం మాట్లాడారు కిషన్ రెడ్డి. కిందపడ్డా పైచేయి తమదేనంటూ కవర్ చేసుకున్నారు.

మునుగోడు ఫలితంపై కిషన్ రెడ్డి వేదాంతం..
X

మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో బీజేపీ దిమ్మతిరిగింది. గెలుస్తాం, కచ్చితంగా గెలుస్తాం, గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన రాజగోపాల్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక కిషన్ రెడ్డి లాంటి నేతలకు ఎలాగూ కెమెరాలను ఫేస్ చేయడం తప్పదు కాబట్టి వారు ఆల్రడీ అధికార పార్టీపై బురదజల్లేందుకు ఫిక్స్ అయ్యారు. నెల్లూరులో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఫలితాలపై స్పందిస్తూ వేదాంతం మాట్లాడారు.

ఓడి గెలిచాము, గెలిచి ఓడారు..

అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలిచి ఓడిందని, తాము మాత్రం ఓడి గెలిచామని వేదాంతం మాట్లాడారు కిషన్ రెడ్డి. కిందపడ్డా పైచేయి తమదేనంటూ కవర్ చేసుకున్నారు. నైతిక విజయం తమదేనన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం వల్ల తాము ఓడిపోయినట్టు వివరణ ఇచ్చారు కిషన్ రెడ్డి. నెలరోజుల ముందుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు.. ఇలా అధికార పార్టీనేతలంతా మునుగోడులో మోహరించారని చెప్పుకొచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం..

మునుగోడుతో ముచ్చట తీరిపోలేదని, ముసళ్ల పండగ ముందుందని సెటైర్లు పేల్చారు కిషన్ రెడ్డి. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. మొత్తమ్మీద మునుగోడు ఫలితంపై ఎలా స్పందించాలో తెలియక బీజేపీ తికమకపడుతోంది. ఓటమిని జీర్ణించుకోలేక, ఏడాదిలోగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది.

First Published:  7 Nov 2022 9:03 AM GMT
Next Story