Telugu Global
Telangana

తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు..ఏ జిల్లాలో అంటే..?

వెంటనే స్పందిచిన సీఎం కేసీఆర్ ఫోన్‌లో అధికారులతో మాట్లాడి కొత్త మండలాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు..ఏ జిల్లాలో అంటే..?
X

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. సాత్నాల, బోరాజ్‌ మండలాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 18 గ్రామాలతో సాత్నాల, 28 గ్రామాలతో బోరాజ్‌ మండలాలు ఏర్పాటు కానున్నాయి. అయితే అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు 15 రోజులు గడువు ఇచ్చారు. తర్వాత సాత్నాల, బోరాజ్‌లను మండలాలుగా గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

అవసరాలకు అనుగుణంగా కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే జూన్‌లో కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా.. మాజీ ఎంపీ గోడెం నగేష్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న కొత్త మండలాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందిచిన సీఎం కేసీఆర్ ఫోన్‌లో అధికారులతో మాట్లాడి కొత్త మండలాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే సాత్నాల, బోరాజ్‌లను మండలాలుగా ఖరారు చేశారు.

ఇక నెల రోజుల క్రితమే ఆదిలాబాద్‌ జిల్లాలో సోనాలను 19వ మండలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బోథ్‌ మండలం నుంచి వేరు చేసి సోనాలను ప్రత్యేక మండలంగా ప్రకటించారు. తాజాగా సాత్నాల, బోరాజ్‌లను సైతం మండలాలుగా ప్రకటించడంతో ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం మండలాల సంఖ్య 21కి పెరిగినట్లయింది.

First Published:  19 Aug 2023 11:08 AM GMT
Next Story