Telugu Global
Telangana

హైదరాబాద్ : టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కి సోషల్ మీడియాలో వేధింపులు

హైదరాబాద్ కు చెందిన అంతర్జాతీయ టేబుల్ టెన్నీస్ క్రీడా కారిణి నైనా జైస్వాల్ ను సోషల్ మీడియాలో వేదింపులకు గురి చేస్తున్నాడు ఓ వ్యక్తి. దీంతో ఆమె ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేశారు.

హైదరాబాద్ : టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కి సోషల్ మీడియాలో వేధింపులు
X

సోషల్ మీడియాను కొందరు మోసాలకు వాడుకుంటే, ఇంకొందరు విద్వేష ప్రచారలకు వాడుకుంటున్నారు. మరి కొందరు పోకిరీలేమో స్త్రీలను వేధించడానికే వాడుకుంటున్నారు. ఫేక్ ఐడీలతో యువతులను వేధిస్తున్న శాడిస్టులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఈ వేధింపులు ప్రముఖులకు కూడా తప్పడంలేదు.

హైదరాబాద్ కు చెందిన అంతర్జాతీయ టేబుల్ టెన్నీస్ క్రీడా కారిణి నైనా జైస్వాల్ ను కొద్ది రోజులుగా ఓ పోకిరీ వేధిస్తున్నాడు. శ్రీకాంత్‌ అనే యువకుడు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నైనాకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడు. ఈ విషయంపై గతంలో కూడా నైనా జైస్వాల్ పోలీసులకు పిర్యాదు చేయగా అతనికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేశారు. అయినా అతని తీరు మారలేదు. ఇప్పుడు మళ్ళీ వేధింపులకు దిగాడు శ్రీకాంత్‌.

కొంత కాలంగా ఈ వేధింపులు పెరగడంతో ఆమె మళ్ళీ పోలీసులను ఆశ్రయించింది. ఆమె తరపున‌ నైనా జైశ్వాల్‌ తండ్రి అశ్విన్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

First Published:  12 Aug 2022 2:21 PM GMT
Next Story