Telugu Global
Telangana

ఈడీ కార్యాలయంలో పడిపోయిన ఎమ్మెల్సీ రమణ

విచారణ సమయంలో రమణ ఒక్కసారిగా అస్వస్థతకు గురై పడిపోయారు. దాంతో ఈడీ అధికారులు కంగారుపడ్డారు. రమణ వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు.

ఈడీ కార్యాలయంలో పడిపోయిన ఎమ్మెల్సీ రమణ
X

హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రమణ అస్వస్థతకు గురయ్యారు. క్యాసినో కేసులో రమణను ఈడీ విచారణకు పిలిచింది. విచారణ సమయంలో రమణ ఒక్కసారిగా అస్వస్థతకు గురై పడిపోయారు. దాంతో ఈడీ అధికారులు కంగారుపడ్డారు. రమణ వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు. వారు రమణను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రమణకు బీపీ డౌన్ అవ్వ‌డంతో అస్వస్థతకు గురైనట్టు భావిస్తున్నారు.

క్యాసినో కేసుతో సంబంధాలు ఉన్నాయంటూ.. టీఆర్‌ఎస్, వైసీపీ నేతలు, వారి బంధువులను ఈడీ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డిని విచారించారు. మంత్రి తలసాని సోదరులను విచారించారు. ఎమ్మెల్సీ రమణను నేడు విచారణకు పిలిచారు. విచారణ సమయంలో రమణ బీపీ డౌన్ అయ్యింది. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

First Published:  18 Nov 2022 7:46 AM GMT
Next Story