Telugu Global
Telangana

నాకు ఈడీ నోటీసులు ఇస్తుందని ముందుగానే బండిసంజయ్ కి ఎలా తెలుసు? ప్రశ్నించిన‌ రోహిత్ రెడ్డి

తనకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకే నిజంగానే నోటీసులు రావడంలోని మర్మమేంటని BRS MLA రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. తనకు ఈడీ నోటీసులు ఇస్తుందని బండి సంజయ్ కి ముందుగానే ఎలా తెలిసిందని, దీనిపై విచారణ జరిపి నిజానిజాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నాకు ఈడీ నోటీసులు ఇస్తుందని ముందుగానే బండిసంజయ్ కి ఎలా తెలుసు? ప్రశ్నించిన‌ రోహిత్ రెడ్డి
X

తనకు ఈడీ నోటీసులు రావడంపై బీఆరెస్ ఎమ్మెల్యే కెప్టెన్ రోహిత్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు చేసిన కుట్రను బహిర్గతం చేసినందుకే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని రోహిత్ రెడ్డి మండిపడ్డారు.

తనకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకే నిజంగానే నోటీసులు రావడంలోని మర్మమేంటని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. తనకు ఈడీ నోటీసులు ఇస్తుందని బండి సంజయ్ కి ముందుగానే ఎలా తెలిసిందని, దీనిపై విచారణ జరిపి నిజానిజాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను యాదగిరి గుట్టకు తడి బట్టల్తో వెళ్ళి ప్రమాణం చేస్తానని, బండి సంజయ్ కి ధైర్యముంటే ఆయనకు ముందుగానే ఈడీ నోటీసుల గురించి తెలిసిన విషయంపై ప్రమాణం చేయాలని రోహిత్ రెడ్డి సవాల్ విసిఱఱూ.

తనకు ఈడీ ఇచ్చిన నోటీసులో స్పష్టత లేదని చెప్పిన రోహిత్ రెడ్డి ఈడీ తనను బయోడేటా అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనను ఏ కేసు విషయంలో విచారణ చేయాలనుకుంటున్నారో కూడా తనకిచ్చిన నోటీసులో చెప్ప‌లేదన్నారాయన. అయినప్పటికీ తాను ఈడీకి సహకరిస్తానని రోహిత్ చెప్పారు.

First Published:  16 Dec 2022 2:40 PM GMT
Next Story