Telugu Global
Telangana

ఎవడికో పుట్టినోడిని.. నాకొడుకు అని చెప్పుకునే ఖర్మ బీజేపీది

బీజేపీకి అభ్యర్థులు లేక, ఎవడికో పుట్టినోడిని చంకనేసుకుని నా బిడ్డ నాబిడ్డ అని చెప్పుకుంటోందని సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ.. ఎంపీని, ఎమ్మెల్యేను చేస్తే, ఇప్పుడు అదే పార్టీకి అన్యాయం చేసి, కాంట్రాక్ట్ సొమ్ములకోసం బీజేపీలో చేరారని విరుచుకుపడ్డారు.

ఎవడికో పుట్టినోడిని.. నాకొడుకు అని చెప్పుకునే ఖర్మ బీజేపీది
X

మునుగోడు చరిత్రలో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్ రాలేదని, ఈసారి కూడా డిపాజిట్ గల్లంతవుతుందని అన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రచారం చివరి రోజు మునుగోడులో ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ఆయన రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేశారు. కన్న తల్లిని చంపేందుకు కత్తి చేతబట్టుకుని రాజగోపాల్ రెడ్డి తిరుగుతున్నాడని, అలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు.

ఎవడికో పుట్టినోడిని..

బీజేపీకి అభ్యర్థులు లేక, ఎవడికో పుట్టినోడిని చంకనేసుకుని నా బిడ్డ, నాబిడ్డ అని చెప్పుకుంటోందని సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ.. ఎంపీని, ఎమ్మెల్యేను చేస్తే, ఇప్పుడు అదే పార్టీకి అన్యాయం చేసి, కాంట్రాక్ట్ సొమ్ములకోసం బీజేపీలో చేరారని విరుచుకుపడ్డారు. ఆ దొంగనా*** అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ సన్నాసి నా*** ఓటు అడగడానికి ఇంటికి వస్తే అట్లకాడ కాల్చి వాత పెట్టండి అంటూ ధ్వజమెత్తారు.

సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం..

వెనకటికి ఎవరో లావు మొనగాడు లడాయికి పోతే వెనకాల ముగ్గురు నూకుడు మొనగాళ్లు వచ్చి నెట్టాల్సి వచ్చిందంట.. అలా ఉంది రాజగోపాల్ రెడ్డి పరిస్థితి అంటూ సామెతలు చెప్పి సభలో హుషారు తెప్పించారు రేవంత్ రెడ్డి. సారా పాతదేనని కానీ, సీసా కొత్తదని, దానిపై లేబుల్ మార్చి మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి అయినా, ప్రభాకర్ రెడ్డి అయినా గతంలో ఎమ్మెల్యేలుగా ఇక్కడ పనిచేశారని, ఒక్కసారి పాల్వాయి స్రవంతికి అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 15మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని, అధికారంలోకి వస్తే 4 మంత్రి పదవులు మహిళలకే ఇస్తామని చెప్పారు. ఈ ఆడబిడ్డను సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం అంటూ ప్రసంగాన్ని ముగించారు రేవంత్ రెడ్డి.

First Published:  1 Nov 2022 9:50 AM GMT
Next Story