తెలంగాణ ప్రభుత్వంపై కామెంట్స్.. విజయసాయిపై టీపీసీసీ ఫిర్యాదు
కాంగ్రెస్ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేయడం, ఏకంగా మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యానించడంపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ అయింది.
![తెలంగాణ ప్రభుత్వంపై కామెంట్స్.. విజయసాయిపై టీపీసీసీ ఫిర్యాదు తెలంగాణ ప్రభుత్వంపై కామెంట్స్.. విజయసాయిపై టీపీసీసీ ఫిర్యాదు](https://www.teluguglobal.com/h-upload/2024/02/06/1295127-tpcc-complains-to-police-against-ycp-mp-vijaya-sai-reddy.webp)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. వైసీపీకి తెలంగాణ కాంగ్రెస్తో ఏం శత్రుత్వం ఉందని ఈ కామెంట్లు చేశారంటూ తెగ చర్చ నడిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ వైఖరిని తూర్పారబట్టే క్రమంలోనే విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికార ప్రతినిధి సుజాత
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేయడం, ఏకంగా మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యానించడంపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ అయింది. ఈ మేరకు టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు విజయసాయిరెడ్డి మీద కంప్లయింట్ చేశారు. రాజ్యసభలో ఆన్రికార్డ్లో ఏపీ ఎంపీ మాట్లాడిన విషయాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు.