Telugu Global
Telangana

తెలంగాణ ప్ర‌భుత్వంపై కామెంట్స్‌.. విజ‌య‌సాయిపై టీపీసీసీ ఫిర్యాదు

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు చేయ‌డం, ఏకంగా మూడు నెల‌ల్లో ప్ర‌భుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యానించ‌డంపై తెలంగాణ కాంగ్రెస్ సీరియ‌స్ అయింది.

తెలంగాణ ప్ర‌భుత్వంపై కామెంట్స్‌.. విజ‌య‌సాయిపై టీపీసీసీ ఫిర్యాదు
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెల‌ల్లో కూలిపోతుందంటూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నిన్న రాజ్య‌స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారాయి. వైసీపీకి తెలంగాణ కాంగ్రెస్‌తో ఏం శ‌త్రుత్వం ఉంద‌ని ఈ కామెంట్లు చేశారంటూ తెగ చ‌ర్చ న‌డిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ వైఖ‌రిని తూర్పార‌బ‌ట్టే క్ర‌మంలోనే విజ‌య‌సాయిరెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది.

పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన అధికార ప్ర‌తినిధి సుజాత‌

అయితే తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు చేయ‌డం, ఏకంగా మూడు నెల‌ల్లో ప్ర‌భుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యానించ‌డంపై తెలంగాణ కాంగ్రెస్ సీరియ‌స్ అయింది. ఈ మేర‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసుల‌కు విజ‌య‌సాయిరెడ్డి మీద కంప్ల‌యింట్‌ చేశారు. రాజ్యసభలో ఆన్‌రికార్డ్‌లో ఏపీ ఎంపీ మాట్లాడిన విషయాలపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు.

First Published:  6 Feb 2024 8:17 AM GMT
Next Story