Telugu Global
Telangana

పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు

కాంగ్రెస్ తరపున గెలిచి టీఆరెస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి, సంపత్ తదితరులు పిర్యాదు చేశారు.

పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు
X

గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి అనంతరం టీఆరెస్ (ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరిన ఎమ్మెల్యేలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పిర్యాదు చేశారు.

కాంగ్రెస్ తరపున గెలిచి టీఆరెస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి, సంపత్ తదితరులు పిర్యాదు చేశారు.

సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, బానోతు హరిప్రియా నాయక్, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు తదితరులు కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో గెలిచి అప్పట్లో టీఆర్ఎస్ లోచేరారని కాంగ్రెస్ నాయకులు తమ పిర్యాదులో పేర్కొన్నారు.

అలా చేరినవారంతా స్వప్రయోజనాలకోసమే టీఆరెస్ లో చేరారని, అలా చేరిన తర్వాత వారంతా రాజకీయ , ఆర్థిక ప్రయోజనాలు పొందారని పిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై సీబీఐ విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు కోరారు.

First Published:  6 Jan 2023 11:07 AM GMT
Next Story