Telugu Global
Telangana

నేడు జగిత్యాలలో పర్యటించనున్న‌ సీఎం కేసీఆర్

కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవల్లి ఫాం హౌజ్ నుండి హెలీకాప్టర్ లో బయలు దేరుతారు. 12:30 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌ ఆవరణలోని హెలీపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో టీఆరెస్ నూతన కార్యాలయానికి చేరుకుంటారు.

నేడు జగిత్యాలలో పర్యటించనున్న‌ సీఎం కేసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం, వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభం..తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవల్లి ఫాం హౌజ్ నుండి హెలీకాప్టర్ లో బయలు దేరుతారు. 12:30 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌ ఆవరణలోని హెలీపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో టీఆరెస్ నూతన కార్యాలయానికి చేరుకుంటారు. టీఆరెస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఒంటి గంటకు వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత‌ మధ్యాహ్నం 1:15కు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు.

సాయంత్రం జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. అనంతరం 4 గంటలకు హెలీకాప్టర్ లో బయలుదేరి ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జగిత్యాల పట్టణం అందంగా ముస్తాబయ్యింది. కేసీఆర్ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు మంగళవారం పరిశీలించారు. కేసీఆర్ సభకు 3లక్షల మంది ప్రజలు వస్తారని టీఆరెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.

First Published:  7 Dec 2022 2:19 AM GMT
Next Story