Telugu Global
Telangana

రైతు రుణమాఫీ.. కాంగ్రెస్ ప్లాన్ ఇదే..!

అధికారంలోకి వస్తే ఏకకాలంలో అప్పు, వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. ఈ మేరకు మేనిఫెస్టోలోనూ ప్రకటించింది.

రైతు రుణమాఫీ.. కాంగ్రెస్ ప్లాన్ ఇదే..!
X

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీపై కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్‌. ఇప్పటికే బ్యాంకులతో చర్చలు ప్రారంభించింది. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ట్విట్టర్‌లో ప్రకటించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని కార్పొరేషన్‌కు మళ్లించాలని నిర్ణయించింది. రైతులకు ఒకే సారి రుణాలు మాఫీ చేయాలని బ్యాంకులను కోరింది ప్రభుత్వం. నెలవారీగా ఐదేళ్ల పాటు EMI పద్ధతిలో డబ్బులు చెల్లిస్తామని బ్యాంకుల ముందు ప్రతిపాదన పెట్టింది.

అధికారంలోకి వస్తే ఏకకాలంలో అప్పు, వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. ఈ మేరకు మేనిఫెస్టోలోనూ ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది రైతులు రుణగ్రస్తులుగా ఉన్నారు. రూ.2 లక్షల చొప్పున మాఫీ చేస్తే దాదాపు రూ. 32 వేల కోట్లు అవసరం కానున్నాయి.

2014, 2018 ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చిన బీఆర్ఎస్‌.. 2014-18 మధ్య సక్సెస్‌ఫుల్‌గా రుణాలు మాఫీ చేసింది. మొత్తం 36 లక్షల మంది రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. ఇక 2018-23 మధ్య రుణమాఫీ చేయడంలో సక్సెస్ కాలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ.. పూర్తిస్థాయిలో బ్యాంకులకు నగదు బదిలీ చేయడం ఆలస్యం కాగా.. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది.

First Published:  10 Jan 2024 10:56 AM GMT
Next Story