Telugu Global
Telangana

టీఆరెస్ ఎంపీ కుమారుడిని కత్తుల తో బెదిరించి ఆన్ లైన్ లో మనీ ట్రాన్స్ ఫర్

హైదరాబాద్ లో సంచలన ఘటన జరిగింది. ఓ ఎంపీ కుమారుడి వాహనాన్ని అడ్డగించి దుండగులు దోపిడి చేశారు. ఆయనను కత్తులతో బెదిరించి డబ్బులను ఆల్ లైన్ ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.

టీఆరెస్ ఎంపీ కుమారుడిని కత్తుల తో బెదిరించి ఆన్ లైన్ లో మనీ ట్రాన్స్ ఫర్
X

టీఆరెస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కుమారుడు పృథ్వీతేజను కొందరు అగంతకులు దారి దోపిడి చేశారు. శనివారం అర్దరాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్ టోలీ చౌక్ వద్ద ఓ షాపింగ్ కాంప్లెక్స్‌కి వెళ్లి పృథ్వీతేజ తిరిగి కారులో వెళ్తుండగా కారును అడ్డగించిన కొందరు దుండగులు అందులో ఎక్కారు. ఆయనను కత్తులతో బెదిరించి అదే కార్లో టోలీ చౌక్ నుంచి పంజా గుట్టదాకా వచ్చారు.

ఆ తర్వాత పృథ్విని కత్తులతో భయపెట్టి ఆయన ఫోన్ ద్వారా 75 వేల రూపాయలను తమ ఖాతాల్లోకి ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. అనంతరం ఆయనను పంజా గుట్టలో వదిలేసి వాళ్ళు కారు దిగి వెళ్ళిపోయారు.

అయితే పృథ్వి ఈ ఘటనపై వెంటనే పోలీసులకు పిర్యాదు చేయలేదు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విషయంపై ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆదివారంనాడు పంజా గుట్ట పోలీసులకు పిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు విచారణ చేపట్టారు.

First Published:  2 Aug 2022 6:46 AM GMT
Next Story