Telugu Global
Telangana

దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.. కేసీఆర్ చేతుల మీదుగా రేపే ఆవిష్కరణ‌

దేశంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహ తయారీకి తెలంగాణ ప్రభుత్వం 146.50 కోట్లను కేటాయించింది. మొత్తం 11.80 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించారు. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేడ్కర్ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.. కేసీఆర్ చేతుల మీదుగా రేపే ఆవిష్కరణ‌
X

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ నగరం సిద్దమవుతోంది. హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేడ్క‌ర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ కూడా హాజరుకానున్నారు.

దేశంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహ తయారీకి తెలంగాణ ప్రభుత్వం 146.50 కోట్లను కేటాయించింది. మొత్తం 11.80 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించారు. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేడ్కర్ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం కింద ఉన్న పీఠంలో 27,556 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇందులో అంబేడ్కర్ మ్యూజియం, ఆయన జీవితానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం పది కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. 50 వేల మంది ఆశీనులయ్యేలా విగ్రహం ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆరెస్ ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది. దాదాపు 750 బస్సులను ఇందుకోసం వినియోగిస్తున్నారు. రెండు లక్షల మంచి నీళ్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీట్ ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు.

First Published:  13 April 2023 6:50 AM GMT
Next Story